సత్యసాయి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడు ఘటనపై YCP అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద తీవ్రతకు ఇళ్లు ధ్వంసం కావడం, పలువురు గాయపడటం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని కోరారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.