VSP: జిల్లా వైసీపీ కార్యాలయంలో అధ్యక్షుడు కె.కె. రాజు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. పార్టీని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు మరియు సచివాలయ స్థాయిల్లో పటిష్టం చేయాలని, ఇందుకోసం సమగ్రమైన కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సభ్యుల వివరాలను డిజిటల్ డేటాబేస్లో నమోదు చేసి, నిర్ణీత గడువులోగా కార్యాలయానికి సమర్పించాలన్నారు.