KDP: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ఆకుల తిరుమలబాబు హెచ్చరించారు. సోమవారం సిద్ధవటం మండలం బొగ్గిడివారిపల్లె పంచాయతీ నిర్మలగిరి కాలనీలో సుమారు 3.50 ఎకరాల భూమిని ఆక్రమించారన్న సమాచారంతో MRO ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.