NLR: వలేటివారిపాలెం మాలకొండ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త పార్వతి అధ్యక్షతన గురువారం పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. గర్భధారణ నుంచి రెండేళ్ల వరకు మొదటి వెయ్యి రోజులు శిశువు అభివృద్ధికి కీలకమని తెలిపారు. చిన్న పిల్లలకు మొబైల్, TV వినియోగం తగ్గించి, ఆరుబయట ఆటలకు ప్రోత్సహించాలన్నారు.