కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం నుంచి 19వ తేదీ వరకు వేద అధ్యయనోత్సవాలు జరుగుతాయని ఆలయ డీసీ చక్రధరరావు తెలిపారు. ప్రతి రోజు ద్రవిడ వేద పారాయణం జరుగుతుందన్నారు. ఆదివారం గ్రామోత్సవం జరుగుతుందన్నారు. సోమవారం గరుడ వాహన సేవ, మంగళవారం సింహ వాహన సేవ, బుధవారం హంస వాహన సేవ ఏర్పాటు చేశామన్నారు