VSP: మెడికల్ మాఫియా దోపిడీని వెంటనే అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ రహిమాన్ డిమాండ్ చేశారు. శనివారం బుల్లయ్య కాలేజీ ఎదురుగా డీఎంహెచ్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి, ప్రైవేట్ దవాఖానల్లో అవసరం లేని పరీక్షలు, భారీ ఫీజులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.