AKP: కసింకోట మండలం విసన్నపేటలో గౌరీ పార్వతి కిరాణా దుకాణంలో రూ. 69,000 నగదును దొంగలించిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన డీ.నవీన్, ఎన్. వీరబాబు కలిసి దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. వీరిని శనివారం అరెస్టు చేసి దొంగలించిన నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.