TPT: తిరుపతి కొర్లగుంటలో జరిగిన జననగణన-2027 క్షేత్రస్థాయి శిక్షణ కార్య క్రమాన్ని కమిషనర్ ఎన్.మౌర్య పరిశీలించారు. ఎన్యుమరేషన్ యాప్ వినియోగంపై సిబ్బందికి సూచనలు చేశారు. నగరంలో 800 ఎన్యుమరేటర్లు, 150 సూపర్వైజర్లు నియమించామని తెలిపారు. ఏప్రిల్ 8 నుంచి తదుపరి శిక్షణ, మే నుంచి గణన ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.