NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.9,76,224 లక్షల ఆదాయం వచ్చినట్లు EO చంద్రశేఖర్ తెలిపారు. ప్రత్యేక దర్శనానికి రూ.2,45,900, లడ్డూ ప్రసాదానికి రూ.2,16,105, అన్న ప్రసాదానికి రూ.3,98,528, తలనీలాలకు రూ.31,725, వివిధ పూజలకు సంబంధించి రూ.62,506, రూమ్ అద్దెల ద్వారా రూ.21,440 సమకూరిందని వివరించారు.