VZM: పిజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ కు వేదికగా ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని జె. సి.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పి.జీ.ఆర్.ఎస్ / రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆయన డిఆర్వో సత్తిబాబు, ఇతర అధికారులతో కలిసి వినతులను స్వీకరించారు.