SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష గురువారం మంత్రి అచ్చెన్నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వజ్రపుకొత్తూరు మండలం, మంచినీళ్ళపేట గ్రామంలో మత్స్యకారుల కోసం మినీ జెట్టి నిర్మాణం కోసం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని, వీలైనంత త్వరగా సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.