KRNL: పెద్దకడబూరు మండలంలోని చిన్నకడబూరు గ్రామంలో నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై జేఈ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని గుర్తు చేశారు. ఇందులో ఈసీ ఖాదర్ బాషా ఉన్నారు.