CTR: చిత్తూరులో వక్ఫ్ భూములను అక్రమంగా విక్రయించడంపై రాష్ట్ర వక్స్ బోర్డు ఆడిటర్ మహ్మద్ రియాజ్ ఫిర్యాదు చేయడంతో వన్ టౌన్ CI మహేశ్వర్ నలుగురిపై కేసు నమోదు చేశారు. నగరంలోని మండీ వీధిలో ఉన్న వక్ఫ్ భూములు ఆక్రమించి, తప్పుడు పత్రాలతో విక్రయించారని, ఇందులో నలుగురు వ్యక్తులు మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.