NLR: దుత్తలూరు మండలం నందిపాడు కస్తూర్భా పాఠశాల సమీప హైవే వద్ద ఆదివారం కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు అవ్వగా సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కడప నుంచి పొదిలికి వెళ్తున్న కారు నందిపాడు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఎవ్వరికి ప్రాణ హాని జరగలేదు.