E.G: రాజానగరం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను MLA బత్తుల బాలరామకృష్ణ వెంటనే అమలు చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు శుక్రవారం డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన రోడ్ల అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, రైతులకు మద్దతు ధర తదితర అంశాలు కార్యరూపం దాల్చాలని కోరారు.