ATP: తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని రాయదుర్గం పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి కోరారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రతి వార్డులో పార్టీ జెండాను ఎగురవేయాలని ఆయన నాయకులకు సూచించారు. టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.