HYD: రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆవరణలో గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి హత్య..?, ఆత్మహత్య..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.