BHNG: రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఎం నాయకుడు బైకాని నరసింహ మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ ఇవాళ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా నరసింహ పార్టీకి అందించిన సేవలను గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తల సహకారంతో రూ.37 వేల ఆర్థిక సహాయం అందించారు.