NLG: జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దైవ దర్శనంతోనే మానసిక ప్రశాంతత పొందవచ్చని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండ మండలం మాల్గడ్డ ముత్యాలమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తి భావం మనసుకు ప్రశాంతతను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.