MDK: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సివిల్ సప్లై, వ్యవసాయ, పోలీస్, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, రవాణా, రైస్ మిల్లర్ అసోసియేషన్ యాజమాన్యాలతో యాసంగి ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో రైతులు దళారులను ఆశ్రయించవద్దన్నారు.