E.G: CM క్యాంప్ కార్యాలయంలో పర్యాటక శాఖపై నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో మంత్రి కందుల దుర్గేశ్, తదితరులు పాల్గొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్, చారిత్రాత్మక హావ్లాక్ బ్రిడ్జ్ పునరుద్ధరణ పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం సూచించినట్లు మంత్రి తెలిపారు.