PPM: గుమ్మలక్ష్మీపురం(M) తాడికొండ పంచాయతీ శిఖరంపై గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారింది. సుమారు 24 కుటుంబాలు, 200కు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో గిరిజనులు బిందెడు నీటి కోసం రోజూ 2 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. కొండ జాలలపై ఆధారపడుతూ తెచ్చుకుంటున్న నీరు శుభ్రంగా లేకపోవడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు