GNTR: పొన్నూరు మండలం మాచవరంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అనంతరం అక్కడ జరుగుతున్న అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షా కేంద్రాన్ని కూడా ఆయన తనిఖీ చేశారు.