కోనసీమ: ఆలమూరు ప్రాంతంలో 2023లో జరిగిన హిజ్రా హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రాజమండ్రి అదనపు కోర్టు జడ్జి ఎస్. ఉమా సునంద తీర్పునిచ్చారు. నిందితులు కేత వెంకట సుధీర్, వేలు కళ్యాణ్, సింగంపల్లి కార్తికేయలకు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ. 15 వేల జరిమానా విధించినట్లు ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు.