నెల్లూరు: ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి తెలిపారు. నెల్లూరులో నిర్వహించిన రైతు సాధికార సంస్థ క్యాడర్ సభ్యుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విత్తనాలు విత్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో DPM కన్నయ్య పాల్గొన్నారు.