కోనసీమ: యానాంలో మంగళవారం ఎంపీ వి. వైధిలింగం ఆధ్వర్యంలో ‘వాక్ ఫర్ యానాం’ కార్యక్రమం జరగనుంది. ఈ పాదయాత్రలో మాజీ సీఎం నారాయణసామి, సీఎల్పీ నేత వైద్యనాథన్ పాల్గొంటారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేశ్ సోమవారం తెలిపారు. మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10 వరకు సాగే ఈ యాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తారు