అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశాభివృద్ధిలో ఆయన పోషించిన పాత్రను ఈ సందర్భంగా నాయకులు గుర్తు చేసుకున్నారు.