AKP: భవన నిర్మాణ కార్మికులకు ఈనెల 9వ తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నట్లు పాయకరావుపేట తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్షుడు ఎం నారాయణ రావు తెలిపారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి కరపత్రాలను విడుదల చేశారు. తాపీ మేస్త్రికి రోజుకు రూ.900, మగ కూలికి రూ.750, పడ కూలికి రూ.600 చెల్లించాలన్నారు.