KDP: వీరబల్లిలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో సుమారు 70 మందికి పరీక్షలు నిర్వహించారు. 22 మందికి కాటరాక్ట్ ఆపరేషన్ అవసరమని గుర్తించి కడపకు తరలించగా, 30 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.