E.G: కొవ్వూరు మండలం తోగుమ్మిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేసారు .HDBFS-WASHI ప్రోత్సాహంతో సుమారు రూ. 17లక్షల అంచనాతో నిర్మించబడనున్న డైనింగ్ రూమ్ నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందించాలని సిబ్బందికి సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.