తిరుపతి చెన్నారెడ్డి కాలనీ ఇంటిగ్రేటెడ్ ఎస్సీ హాస్టల్లో సుమారు 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టల్లో పిల్లలతో పూరీలు రుద్దించడం, వంట పనులు చేయించడం జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు వార్డెన్లు ఉదయం డ్యూటీకి రాకపోవడం సమస్యగా మారింది. సమయానికి భోజనం ఇవ్వకపోవడంతో రాత్రి 9:30 గంటల తర్వాతే ఆహారం అందిస్తున్నారని, ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని విద్యార్థులు తెలిపారు.