సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత అధ్యక్షతన ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, రైతులు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించారు. బాధితుల విన్నపాలను సావధానంగా విన్న ఆమె, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.