కోనసీమ: అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని 6వ, 7వ వార్డుల్లో శనివారం నిర్వహించిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. కాలువలు, డ్రైన్లలోని పూడికలు, చెత్తను తొలగించి శుభ్రపరిచారు. ప్రజలు చెత్తను డ్రైన్లలో వేయకుండా పరిశుభ్రత పాటించాలని కమిషనర్ సూచించారు.