VSP: 2026-27విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి తరగతిలో 25% పేద బాలలకు ఉచిత కోటా సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్రవారం ఎంవీపీ కాలనీలోని ప్రిన్సిపాల్ డా.కే జగదీశ్వరరావుతో కలిసి గోడపత్రికను ఆవిషరించారు. జిల్లాలో అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీ రైట్ టు ఎడ్యుకేషన్ ఫోరమ్ కన్వీనర్ నరవ ప్రకాశరావు కోరారు.