NLR: బోగోలు మండలం తెల్లగుంటకు చెందిన అక్షయ తండ్రి, కలిగిరి మండలం నాగసముద్రానికి చెందిన రేష్మ తండ్రి వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఇళ్లలో తండ్రుల మృతదేహాలు ఉన్నప్పటికీ, తీరని శోకంలోనే ఈ ఇద్దరు విద్యార్థినులు గుండెనిబ్బరంతో పదో తరగతి పరీక్షలకు హాజరై అందరినీ కంటతడి పెట్టించారు.