SKLM: కూటమి ప్రభుత్వం మొక్క జొన్న పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో విఫలమయిందని మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ అన్నారు. రణస్థలం మండలం మహంతిపాలెం గ్రామంలో బుధవారం గ్రామ కమిటీల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.