బాపట్ల: పంగులూరు మండల కేంద్రంలోని APM వెలుగు కార్యాలయ మీటింగ్ హాల్లో జనగణన-2027 (Census 2027) శిక్షణ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తహసీల్దార్ సింగారావు మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు క్షేత్రస్థాయిలో డేటా సేకరణపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయని, అన్నారు.