ELR: పెదవేగి(మం) దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అలాగే వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు.