ATP: రంజాన్ మాసం మూడవ జుమా సందర్భంగా గుత్తి కేబీఎన్ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. మసీదు ఇమామ్ హుస్సేన్ ఉపవాసం, దానధర్మాలు, ఆధ్యాత్మికతపై ప్రసంగించారు. ఈ పవిత్ర మాసంలో చేసే నమాజ్, సత్కారాలకు అధిక పుణ్యం లభిస్తుందని తెలిపారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో నమాజ్ పూర్తిచేసి దువా చేశారు.