TG: హైదరాబాద్లో సౌభాగ్య ఇస్పాత్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ. 26.86 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద ఫ్లాట్లు, ఖాళీ స్థలాలను అధికారులు జప్తు చేశారు. బ్యాంకును మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నకిలీ స్టాక్ స్టేట్ మెంట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ. కోట్ల రుణాలు పొందినట్లు గుర్తించారు.