కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు డీఎస్పీ జె.బాబూ ప్రసాద్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సీఐ మన్సు రుద్దీన్ డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, వేగం నియంత్రిస్తూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.