VSP: విశాఖపట్నం ఆరిలోవకు చెందిన GVMC ఉద్యోగి గౌరి నాయుడు పెదవాల్తేరులోని సహచరురాలి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 12 నుంచి అక్కడే ఉంటున్న ఆయన ఇంటికి రాకపోవడంతో భార్య ఫిర్యాదు చేయగా, పోలీసులు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.