KDP: 2021లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కమలాపురం(M)మీరాపురంకి చెందిన కిరణ్ కుమార్ అనే నిందితుడికి కడప జిల్లా పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. సమర్పించిన సాక్ష్యాలు, దర్యాప్తు అధికారుల నివేదికలను పరిశీలించిన కోర్టు నేరం రుజువైనట్లు నిర్ధారించిందని కడప జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ మీడియాకు తెలిపారు.