NDL: మంత్రాలయం ఘోర రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాల గురించి సీఐ దస్తగిరి బాబు, ఎస్సై మల్లికార్జునను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు జరిపి, పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణించరాదని ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టిన చైతన్యం రావడం లేదన్నారు.