విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఇవాళ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా అధికారులు నైపుణ్యాలు పెంచుకుని సాంకేతికతను వినియోగించాలని సూచించారు. గంజాయి, సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత పాల్గొన్నారు.