ప్రకాశం: మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బోడే నాయక్ తండా సమీపంలో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా 108 అంబులెన్స్లో స్థానికులు వారిని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శ్రీశైలం దర్శనం అనంతరం విజయనగరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.