కృష్ణా: ఇంటర్ ఫలితాల్లో గుడివాడ పట్టణానికి చెందిన నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థి ఆకునూరి శ్యామ్ శరణ్య ఇవాళ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇంటర్ సెకండ్ ఇయర్లో మొత్తం 1000 మార్కులకు గాను 992 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్గా నిలిచింది. శరణ్య సాధించిన ఈ విజయంపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.