శ్రీకాకుళం జిల్లా శ్రీసత్య సాయి సేవా సంస్థల ముఖ్యపథాధికారుల సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు తమ అమూల్యమైన సందేశంతో చైతన్యపరచి, స్ఫూర్తినింపి, దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో ప్రతి గ్రామానికి సేవలు అందిస్తూ.. భజన మండలిలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆధ్యాత్మిక భావనలు కలుగజేయుట ద్వారా గ్రామాలలో శాంతి సామరస్యాలు నెలకొల్పుతారన్నారు.