NTR: కంచికచర్లలో మట్టల ఆదివారం వేడుకలు మిన్నంటాయి. కార్యక్రమంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఖర్జూర మట్టలతో ఊరేగింపు నిర్వహించారు. ‘రాజుల రాజుకు జై.. యూదుల రాజుకు జై’ అంటూ భక్తిశ్రద్ధలతో నినాదాలు చేస్తూ పురవీధుల్లో కీర్తనలు ఆలపించారు. ఈ వేడుకల్లో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ఉత్సాహంగా మట్టలు ఊపుతూ క్రీస్తును స్మరించుకున్నారు.