నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్సు శుక్ల అధ్యక్షతనలో విద్యుత్ శాఖ అధికారులతో సోమవారం పీఎం కుసుమ్ పథకంపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ పథకం అమలుకు 437 ఎకరాల భూమిని గుర్తించగా, 215 ఎకరాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 22 ఎకరాలను త్వరలో స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు.